కేసీఆర్‌కు ఆనాడు మంత్రి పదవి ఇచ్చి ఉంటే...

కేసీఆర్‌కు ఆనాడు మంత్రి పదవి ఇచ్చి ఉంటే...
x
Highlights

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌కు నాడు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీయే...

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌కు నాడు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీయే ఉండేది కాదన్నారు. తనను తిడుతూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్న కేసీఆర్ గతాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్‌దేనంటూ చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణలో ఉన్న వనరులు ఎక్కడా లేవన్నారు. తెలంగాణకు కేసీఆరే ప్రధాన సమస్యగా మారారని విమర్శించారు. అభివృద్ధి ఫలాలను కేసీఆర్ కుటుంబం అనుభవిస్తోందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పోడు భూముల్ని రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజాకూటమి గెలిస్తేనే సంక్షేమం అమలవుతుందని చంద్రబాబు తెలిపారు. నరేంద్ర మోదీ దేశాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. దేశంలోని అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తున్నానని... కేంద్రంలో బీజేపీని ఓడించేందుకే రాహుల్‌ను కలిశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories