ఘోర రైలు ప్రమాదం.. 9మంది మృతి

ఘోర రైలు ప్రమాదం.. 9మంది మృతి
x
Highlights

ఇటీవల రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మొన్న పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగిన ఘటన మరవకముందే ట‌ర్కీ రాజ‌ధాని అంకారాలో మరో రైలు ప్రమాదం వెలుగులోకి...

ఇటీవల రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మొన్న పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగిన ఘటన మరవకముందే ట‌ర్కీ రాజ‌ధాని అంకారాలో మరో రైలు ప్రమాదం వెలుగులోకి వచ్చింది. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ రైలు, మరో రైలింజన్‌ని ఢీకొట్టి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, 47 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మర్సాండిజ్‌లోని చికిత్స సెంటర్కు తరలించారు. సిగ్నలింగ్‌ వ్యవస్థలో చోటుచేసుకున్న సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అంకారా రైల్వే స్టేషన్‌కు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న మర్సాండిజ్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ ప్రమాదంపై టర్కీ అధ్యక్షుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయకచర్యలపై ఆరాతీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories