శ్రీదేవి కూతుళ్లపై అనుచిత వ్యాఖ్యలు

శ్రీదేవి కూతుళ్లపై అనుచిత వ్యాఖ్యలు
x
Highlights

దివంగత నటి శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషి కపూర్లకు బోనీ కపూర్‌ మొదటి భార్య కుమార్తె అన్షులా కపూర్‌ మద్దతుగా నిలిచారు. శ్రీదేవి చనిపోయినప్పుడు బోనీ...

దివంగత నటి శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషి కపూర్లకు బోనీ కపూర్‌ మొదటి భార్య కుమార్తె అన్షులా కపూర్‌ మద్దతుగా నిలిచారు. శ్రీదేవి చనిపోయినప్పుడు బోనీ మొదటి భార్య పిల్లలైన అర్జున్‌, అన్షులా వారికి తోడుగా ఉన్నారు. శ్రీదేవితో ఎలాంటి స్నేహపూర్వక బంధం లేకపోయినా తన తండ్రి కోసం దుబాయ్‌ వెళ్లి శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబయికి తీసుకువచ్చేందుకు అర్జున్‌ సాయం చేశారు.

మరోపక్క అన్షులా తన చెల్లెళ్లు జాన్వి, ఖుషిల వద్దే ఉండి వారిని ఓదార్చారు. ఇదిలా ఉంటే అన్షులా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు ఉంచింది. బాధలో ఉన్న జాన్వీ-ఖుషీలు త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్షతో ఆమె ఆ పోస్టును ఉంచింది. దానికి చాలా మంది పాజిటివ్‌గా స్పందించారు. అయితే అర్జున్‌ హార్డ్‌ కోర్‌ ఫ్యాన్‌ అని చెప్పుకున్న ఓ వ్యక్తి మాత్రం తేడాగా స్పందించాడు. జాన్వీ, ఖుషీలపై అసభ్య పదజాలంతో కామెంట్లు పోస్ట్‌ చేశాడు.

దీనిపై మండిపడ్డ అన్షులా అతగాడిని చెడామడా వాయించేసింది. నా చెల్లెళ్ల గురించి అలా మాట్లాడితే బాగోదని వార్నింగ్‌ ఇచ్చేసింది. ఆపై శాంతించిన ఆమె కూల్‌గా మరో పోస్ట్‌ను పెట్టింది. ‘నాపై నా సోదరుడిపై మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్‌. కానీ, నా సిస్టర్స్‌ ను అలా అవమానించటం సరికాదు. అందుకే మీ కామెంట్లను నేను తొలగిస్తున్నా. ఇంకోసారి ఇలా చెయ్యొద్దని అభిమానులను వేడుకుంటున్నా’ అంటూ మరో పోస్టును చేసింది. శ్రీదేవి చనిపోయిన తర్వాత తన భార్యపై ఉన్న ప్రేమను వివరిస్తూ బోనీ కపూర్‌ ఓ లేఖ రాశారు. అందులో అర్జున్‌, అన్షులా తన కుటుంబానికి అండగా నిలిచారని పేర్కొంటూ ఇలాంటి పిల్లలు ఉన్నందుకు తానెంతో అదృష్టవంతుడినని తెలిపారు. ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories