ఏపీలో మరో పడవ ప్రమాదం

ఏపీలో మరో పడవ ప్రమాదం
x
Highlights

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం, బోరుపాలెం మధ్య బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన...

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం, బోరుపాలెం మధ్య బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఇబ్రహీంపట్నం అడ్డరోడ్డుకు చెందిన సైదారాజు కుటుంబం శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కృష్ణా నదిలో చేపలవేటకు వెళ్లింది. వీరు ప్రయాణిస్తున్న పడవ బోరు పాలెం, అబ్బురాజుపాలెం ఇసుక రీచ్ ల మధ్యలో డ్రెజ్జర్ ఢీకొని మునిగిపోయింది.

ఈ ఘటనలో సైదారాజు ఈదుకుంటూ ఒ‍డ్డుకు రాగా...ఆయన భార్య మాధవి, కూతురు కావ్య మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, జాతీయ విపత్తు దళం మృత దేహాలను వెలికితీశారు. ఇసుక తోడేయడం వల్ల భారీగా గుంతలు ఏర్పడటంతో మృతదేహాలను బయటకు తీయడానికి కష్టపడాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories