నిరుద్యోగ యువతను టీఆర్ఎస్ మోసం చేసింది..: అమిత్ షా

నిరుద్యోగ యువతను టీఆర్ఎస్ మోసం చేసింది..: అమిత్ షా
x
Highlights

నిరుద్యోగ యువతను టీఆర్‌ఎస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ప్రభుత్వ...

నిరుద్యోగ యువతను టీఆర్‌ఎస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నిరుద్యోగులకు మేలు చేయలేకపోయారంటూ విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకర్తిలో నిర్వహించిన మార్పు కోసం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తమ పార్టీని గెలిపిస్తే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్ధానానికి చేరుస్తామంటూ హామి ఇచ్చారు . మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కేసీఆర్ ఎవరికి రిజర్వేషన్లు తగ్గిస్తారో చెప్పాలంటూ అమిత్ షా డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories