పాకిస్తాన్‌కు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌..!

Highlights

పాకిస్తాన్‌కు మరోసారి అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. హఫీజ్‌ సయీద్‌ విడుదలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన అమెరికా.... పాక్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని...

పాకిస్తాన్‌కు మరోసారి అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. హఫీజ్‌ సయీద్‌ విడుదలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన అమెరికా.... పాక్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. హఫీజ్‌ను మళ్లీ అరెస్ట్‌ చేయాలని సూచించిన అమెరికా.... సయీద్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా పేర్కొంది.

అలాగే భారత్‌లో దాడులకు తెగబడుతున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపాలని పాకిస్తాన్‌ను అమెరికా కోరినట్టు వైట్‌హౌస్ సీనియర్‌ అధికారి తెలిపారు. ఇరు దేశాలు తమ మధ్య ఉద్రిక్తతలను చర్చల ద్వారా తొలగించుకోవాలని సూచించారు. ఓ వైపు దాడులు జరుగుతుంటే చర్చలు జరపలేమన్న భారత్‌ వాదన అర్థవంతమైనదన్నారు.

ముంబయి, పఠాన్‌కోట్‌ సహా భారత్‌లో ఇతర ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో పాల్గొన్న వారిపై చర్యలు చేపట్టాలని తాము పాక్‌ను కోరామని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్‌ పూర్తిగా అణిచివేయాలని అన్నారు. భారత్‌, పాకిస్తాన్‌ చర్చల ద్వారా ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలన్న ట్రంప్‌ పాలసీపై మీడియా వివరణ కోరగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories