అంబేడ్కర్ విగ్రహం విధ్వంసం

అంబేడ్కర్ విగ్రహం విధ్వంసం
x
Highlights

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో రెండు చోట్ల అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసం...

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో రెండు చోట్ల అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..యూపీలోని అలహాబాద్‌ పట్టణంలోని త్రివేణిపురంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిని గుర్తించిన స్థానికులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (ఎస్‌ఎస్‌పీ) ఆకాష్‌ కులరి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే యూపీలోని సిద్ధార్థ నగర్‌లోని గోహనియాలో అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఇందుకు కారకులను వెంటనే అరెస్టు చేయాలని వారు ధర్నా చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories