కోడి గుడ్డు కూర వండలేదని భార్యను కాల్చేశాడు..

కోడి గుడ్డు కూర వండలేదని భార్యను కాల్చేశాడు..
x
Highlights

మద్యం మత్తులో ఉన్న భర్త.. కోడి గుడ్డు కూర వండలేదని భార్యను తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలోని దేవ్‌దాస్ గ్రామంలో గురువారం...

మద్యం మత్తులో ఉన్న భర్త.. కోడి గుడ్డు కూర వండలేదని భార్యను తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలోని దేవ్‌దాస్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వ్యవసాయం చేసుకునే నవనీత్(33) మద్యానికి పూర్తిగా బానిస అయ్యాడు. మంగేశ్ శుక్లా అతని భార్య.. వీరికి ముగ్గురు పిల్లలు వున్నారు. ఎప్పటిలానే నవనీత్ గురువారం పీకల దాకా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. తనకిప్పుడు గుడ్డుకూర వండి పెట్టాలని భార్యను డిమాండ్ చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నవ్‌నీత్ భార్యతో వాగ్వాదానికి దిగాడు.

విచక్షణ కోల్పోయి లోపలి గదిలోకి వెళ్ళి తన తండ్రి లైసెన్స్‌డ్ గన్‌ను తీసుకువచ్చి భార్య శుక్లాపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు ఆ ఇంటి వద్దకు చేరుకుని, తీవ్ర గాయాలపాలైన శుక్లాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. శుక్లా సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నవనీత్‌ను అదుపులోకి తీసుకుని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి షాజహాన్‌పూర్ జిల్లా జైలుకు తరలించారు. తండ్రి మద్యంమత్తు ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపిందని, పిల్లలు అనాథలు అయ్యారని స్థానికులు వాపోతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories