మీటూ ఎఫెక్ట్‌తో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న అక్ష‌య్

మీటూ ఎఫెక్ట్‌తో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న అక్ష‌య్
x
Highlights

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని ‘మీటూ’ మూమెంట్ కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లండన్‌లో ఉన్న తాను...

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని ‘మీటూ’ మూమెంట్ కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లండన్‌లో ఉన్న తాను గతరాత్రే ఇండియాకు వచ్చానని.. ఇక్కడ జరుగుతున్నదంతా తెలుసుకున్నానని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ ఒక్కరితోనూ ఇకపై పనిచేసేది లేదని ఆయన ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. అక్షయ్ ప్రస్తుతం నటిస్తున్న ‘హౌస్‌ఫుల్ 4’ మూవీ డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమా షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. గ‌త రాత్రి ఇట‌లీ నుండి ఇండియాకి వ‌చ్చాను. ఇక్క‌డి వార్త‌లు నన్ను చాలా డిస్ట్ర‌బ్ చేశాయి. హౌజ్ ఫుల్ 4 నిర్మాత‌ల‌కి ఫోన్ చేసి అనుమానితులుగా ఉన్న వారి విచార‌ణ పూర్త‌య్యే వర‌కు సినిమా షూటింగ్ నిలిపివేయాల‌ని కోరాను. ఈ స‌మ‌యంలో ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఎంతైన అవ‌స‌రం. ఆరోప‌ణ‌లు నిర్ధార‌ణ అయిన వారితో క‌లిసి ఎప్ప‌టికి ప‌నిచేయ‌ను. అలాగే వేధింపుల‌కి గురైన వారంద‌రికి న్యాయం జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నానని అక్ష‌య్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories