ఎంఐఎం- టీఆర్‌ఎస్ కూటమి గెలుస్తుంది

ఎంఐఎం- టీఆర్‌ఎస్ కూటమి గెలుస్తుంది
x
Highlights

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల రణరంగం ముగిసింది. ఇప్పటికే ఎగ్జీట్ పోల్స్ తమ తీర్పును వెల్లడించాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎంఐఎం అధినేత...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల రణరంగం ముగిసింది. ఇప్పటికే ఎగ్జీట్ పోల్స్ తమ తీర్పును వెల్లడించాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం-టీఆర్ఎస్ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో తమ జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక తాము మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్రంలో భారీ మెజారిటితో అధికార పగ్గాలు చేపట్టనుందని అసదుద్దిన్ ఒవైసీ పేర్కోన్నారు. ఇక పోయిన ఏడాదికంటే ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో ఇటు టీఆర్ఎస్, ఎంఐఎంకు కలిసోస్తుందని అసదుద్దిన్ అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories