వ్యభిచార నెపంతో కోడలికి అగ్నిపరీక్ష

వ్యభిచార నెపంతో కోడలికి అగ్నిపరీక్ష
x
Highlights

తన కోడలుకు వివాహేతర సంబంధం ఉందని, వ్యభిచారం చేస్తుందనే నెపంతో ఆమెకు అత్తమామలు, భర్త కలిసి అగ్నిపరీక్ష నిర్వహించారు. ఈ అమానవీయ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని...

తన కోడలుకు వివాహేతర సంబంధం ఉందని, వ్యభిచారం చేస్తుందనే నెపంతో ఆమెకు అత్తమామలు, భర్త కలిసి అగ్నిపరీక్ష నిర్వహించారు. ఈ అమానవీయ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో చోటు చేసుకుంది. సుమానీ, జైవీర్‌కు గతేడాది ఏప్రిల్‌లో వివాహమైంది. కొన్నాళ్ల పాటు సజావుగానే సాగిన వీరి కాపురంలో అనుమానపు చిచ్చు రేగింది. తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందంటూ జైవీర్‌ ఆరోపించగా, అతడి తల్లి కూడా అందుకు వంతపాడింది. తాను అలాంటి దాన్ని కాదని కోడలు ఎంతగా మొత్తుకున్నా వినకుండా తాంత్రికుడిని పిలిపించింది. కోడలికి అగ్ని పరీక్ష పెడితే అసలు నిజం బయటపడుతుందని అతడు చెప్పడంతో.. సుమానీ చేతులు కాల్చింది. కాగా కట్నం కోసమే తనపై నిందలు వేసి భర్త, అత్త తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ సుమానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఓసారి తనపై హత్యాయత్నం కూడా జరిగిందని.. ఆ సమయంలో తండ్రి మాటకు కట్టుబడి ఫిర్యాదు చేయలేదన్నారు. తన చెల్లెలు కూడా ఈ ఇంటి కోడలు కావడంతోనే ఇన్నాళ్లు బాధలు భరించానని ఆమె పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories