ధోని కనీసం 20 పరుగులు చేసిన మ్యాచ్ మరోలా ఉండేది..

ధోని కనీసం 20 పరుగులు చేసిన మ్యాచ్ మరోలా ఉండేది..
x
Highlights

మంగళవారం జరిగిన సూపర్4 ప్రాధాన్యత లేని మ్యాచ్ లో టీమిండియాను ఓటమి అంచులదాకా తీసుకువచ్చింది ఆఫ్ఘానిస్తాన్ జట్టు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ టై గా...

మంగళవారం జరిగిన సూపర్4 ప్రాధాన్యత లేని మ్యాచ్ లో టీమిండియాను ఓటమి అంచులదాకా తీసుకువచ్చింది ఆఫ్ఘానిస్తాన్ జట్టు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ టై గా ముగిసింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. షహజాద్‌ 124 పరుగులతో చెలరేగితే.. మొహమ్మద్‌ నబీ 64 పరుగులతో ఆదుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ 60 పరుగులు, అంబటి రాయుడు 57 పరుగులు చేసి పరవాలేధనిపించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. రాయుడు, రాహుల్‌ పెవిలియన్ కు చేరాక వచ్చిన ధోని, పాండేలు… చెరో ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత 19 పరుగులకే జాదవ్‌ రనౌట్‌ కాగా… 44 పరుగులు చేసిన కార్తీక్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. ఆ వెంటనే అనుభవం లేని బ్యాట్స్‌మెన్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. చివరి ఓవర్లో విజయానికి భారత్‌కు 7 పరుగులు అవసముండగా.. జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్‌ తీయాల్సి ఉండగా జడేజా ఔటవ్వడంతో.. మ్యాచ్‌ టైగా ముగిసింది. కాగా ఈ మ్యాచ్ లో ధోని కనీసం 20 పరుగులు చేసి వున్నా మ్యాచ్ మరోలా ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే భారత్ ఆసియా కప్ ఫైనల్ కు చేరుకోగా.. నేడు అబుదాబి వేదికగా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ తలపడనున్నాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది

Show Full Article
Print Article
Next Story
More Stories