సోషల్ మీడియాకు సోనమ్ కపూర్ గుడ్‌బైై .. కారణం ఏంటంటే..

సోషల్ మీడియాకు సోనమ్ కపూర్ గుడ్‌బైై .. కారణం ఏంటంటే..
x
Highlights

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో హైపర్ యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ కొంతకాలంగా ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని,...

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో హైపర్ యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ కొంతకాలంగా ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని, అంతా నెగటీవిటి ఉందని చెబుతూ ట్విట్టర్ కు గుడ్ బై చెప్పేసింది. ఇటీవల సోనమ్‌ కపూర్ పెట్టిన ఓ పోస్టుపై నెటిజన్ స్పంస్తూ.. 'సోనమ్‌కపూర్.. మీలాంటి సెలబ్రిటీలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాడరు. మీరు వాడే లగ్జరీ కార్లు కేవలం 3, 4 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి. దాంతో పాటు మీ ఇంట్లో వినియోగించే 10 లేక 20 ఏసీల వల్ల గ్లోబల్ వార్మింగ్‌ ఏర్పడుతోంది. మొదట మీ ఇంటి నుంచే కాలుష్యాన్ని తగ్గించాలంటూ‌' పోస్ట్ చేశాడు. దాంతో ఆమెకు ట్రోల్స్ మొదలయ్యాయి. దీంతో సోనమ్‌కు కోపం వచ్చింది. తాను ట్విట్టర్ కు గుడ్ బై చెబుతాను అందుకు కారణమైన ప్రధానాంశం కాలుష్యం. అంతా నెగటివిటియే ఇందుకు కారణం. ప్రశాంతత, ప్రేమ మీ అందరికీ' అంటూ సోనమ్ తన ట్వీట్‌లో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories