యూపీలో దారుణం...40 మందికి ఎయిడ్స్ ఎక్కించిన డాక్టర్..

యూపీలో దారుణం...40 మందికి ఎయిడ్స్ ఎక్కించిన డాక్టర్..
x
Highlights

ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఒకేసారి 40 మంది ఎయిడ్స్ బాధితులుగా తేలడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వైద్యుడినంటూ...

ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఒకేసారి 40 మంది ఎయిడ్స్ బాధితులుగా తేలడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వైద్యుడినంటూ చెప్పుకునే ఓ వ్యక్తి తనవద్దకు వచ్చే రోగులందరికీ ఇంజక్షన్‌ల కోసం ఒకే సిరంజి ఉపయోగించినట్టు చెబుతున్నారు. ఆ కారణంగానే బాధితులకు ఎయిడ్స్ సోకినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఉన్నావో జిల్లా పరిధిలోని బంగర్ మావ్ ప్రాంతంలో గత సంవత్సరం చివర్లో ఈ ప్రాంతంలో ఓ హెల్త్ క్యాంప్ నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే సదరు క్లినిక్ కు వెళ్లిన అందరి రక్త నమూనాలను పరీక్షించాలని నిర్ణయించారు.

"దాదాపు 40 హెచ్ఐవీ కేసులు బయటకు వచ్చాయి. ప్రతి ఒక్కరినీ పరీక్షిస్తే దాదాపు 500 మందికి ఈ వ్యాధి సోకినట్టు తేలవచ్చు. తమకున్న రోగాలను నయం చేసుకునేందుకు ఆసుపత్రికి వెళితే, అక్కడి డాక్టర్ ఒకే సిరంజిని అందరికీ వాడటమే దీనికి కారణం" అని బంగార్ మావ్ సిటీ కౌన్సిల్ సునీల్. తాము హెల్త్ క్యాంపులు పెట్టిన వేళ ఈ విషయం బయటకు వచ్చిందని, నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ ప్రమోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆసుపత్రి వైద్యుల లైసెన్స్ లను రద్దు చేశామని, విచారణ కొనసాగుతోందని, ఆసుపత్రికి వచ్చిన కొందరు ట్రక్ డ్రైవర్ల నుంచి వైరస్ వ్యాపించి ఉండవచ్చని ఆరోగ్య మంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories