ఇవాళ అనంతపురం జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

YS Sharmila Visit to Anantapur District Today
x

ఇవాళ అనంతపురం జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

Highlights

YS Sharmila: సుదీర్ఘకాలం తర్వాత అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ జెండాలు

YS Sharmila: సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు, జెండాలు అనంతపురం జిల్లాలో కళకళలాడుతున్నాయి. ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారులపై కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెలిశాయి. దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలు నగరంలో ప్రత్యక్షం కావడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవాళ తిరుపతి నుంచి ఆమె అనంతపురం వెళ్లనున్నారు. లలితాకళా పరిషత్‌లో కార్యకర్తలు, నాయకులతో సమావేశంకానున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆమె ప్రసంగించనున్నారు. షర్మిల సమక్షంలో పలువురు ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories