Kothapalli Geetha: కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది

The Central Funds Have Been Diverted By The State Government Says Kothapalli Geetha
x

Kothapalli Geetha: కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది

Highlights

Kothapalli Geetha: ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయం

Kothapalli Geetha: కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ ఫలాలు అందించినా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు కొత్తపల్లి గీత. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొత్తపల్లి గీత తన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీతో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు. నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తీకి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ప్రభుత్వం వాగ్ధానాలు ఇచ్చి.. మోసం చేసిందన్నారు. యువకులకు ఉపాధిలేదని.. ఇక జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories