Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Huge Devotees Rush At Tirumala Tirupati Temple
x

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Highlights

Tirumala: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,570 మంది

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 13 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారిని 65 వేల 570 మంది భక్తులు దర్శించుకోగా.. 24 వేల 446 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 3 కోట్ల 53 లక్షల ఆదాయం చేకూరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories