Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం

Huge Devotees Rush At Tirumala Tirupati Temple
x

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం

Highlights

Tirumala: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,439 మంది

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో కంపార్ట్‌మెంట్లలో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనానికి సుమారు 5గంటలు సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారిని 62వేల 439 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22వేల 27 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్ల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనంలో టోకెన్లు లేకుండా ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం పథ్నాలుగు గంటల సమయం పడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories