Andhra Pradesh: ఎన్నికల వేళ.. రూ.8 కోట్లు పట్టుబడిన నగదు

Huge cash seized in NTR district
x

Andhra Pradesh: ఎన్నికల వేళ.. రూ.8 కోట్లు పట్టుబడిన నగదు

Highlights

Andhra Pradesh: పైపుల లోడు లారీలో నగదు తరలిస్తుండగా స్వాధీనం

Andhra Pradesh: ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో పోలీసులు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొనసాగుతుండడంతో పలుచోట్ల కరెన్సీ భారీగా పట్టుబడుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు 8 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తోన్న పైపుల లోడు లారీలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories