CM Jagan: కర్నూలు, అనంతపురంలో సీఎం జగన్‌ బస్సుయాత్ర

CM Jagan bus Yatra to Kurnool and Anantapur
x

CM Jagan: కర్నూలు, అనంతపురంలో సీఎం జగన్‌ బస్సుయాత్ర

Highlights

CM Jagan: గరిగెట్ల మీదుగా జొన్నగిరి చేరుకోనున్న యాత్ర

CM Jagan: ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నాలుగో రోజుకు చేరింది. నేడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బస్సు యాత్ర కొనసాగనుంది. కర్నూలు జిల్లా రాతన నైట్ హాల్ట్ నుంచి బయలుదేరి తుగ్గలి చేరుకోనున్నారు జగన్. అక్కడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి గరిగెట్ల క్రాస్ రోడ్ మీదుగా జొన్నగిరి చేరుకుంటారు. ఇక కర్నూలు జిల్లా నేతలకు వీడ్కోలు పలికి బస్సుయాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. బసినేపల్లి, గుత్తి, పామిడి, గార్లదిన్నె, రాప్తాడు, ఇటికలపల్లి మీదుగా క్రిష్ణంరెడ్డిపల్లికి చేరుకుంటారు. రాత్రికి సంజీవపురంలో బస చేస్తారు సీఎం జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories