Chandrababu: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. రాత్రి 9 గంటల తర్వాత అమిత్‌షా, నడ్డాలతో భేటీ

Chandrababu Reached Delhi
x

Chandrababu: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. రాత్రి 9 గంటల తర్వాత అమిత్‌షా, నడ్డాలతో భేటీ

Highlights

Chandrababu: అమిత్‌షాతో భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే ఛాన్స్

Chandrababu: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ- జనసేనతో బీజేపీ పొత్తుపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశముంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. పొత్తుల అంశంపై ఇవాళ రాత్రి తొమ్మిది గంటల తర్వాత బీజేపీ అగ్రనేత అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించనున్నారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. చంద్రబాబు, అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని హైకమాండ్ కు ఇప్పటికే మెజారిటీ ఏపీ బీజేపీ నేతలు సూచించారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని రెండు, మూడు ఎంపీ సీట్లు గెలువాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories